Rahul Gandhi: లోక్‌స‌భ‌కు రాహుల్..అవిశ్వాస తీర్మానానంపై డిబేట్

Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత లోక్‌స‌భ ఎంపీగా పార్ల‌మెంట్‌లో ఈరోజు అడుగుపెట్టారు. మణిపూర్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై (manipur violence) పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష‌పై (no confidence motion) రేపే డిబేట్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ డిబేట్‌లో ప్ర‌ధాన స్పీక‌ర్‌గా రాహులే ఉండాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిర్ణయించారు. రాహుల్ స్వ‌యంగా మ‌ణిపూర్ వెళ్లి అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసున్నాడు కాబట్టి ఆయ‌నే డిబేట్‌లో ప్ర‌ధాన స్పీక‌ర్‌గా ఉండి అన్ని విష‌యాలు మాట్లాడాలని కోరుకుంటున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మాణిక్యం తెలిపారు.