Raghunandan Rao: కేసీఆర్.. 15 రోజుల్లో నీ 15 ఎమ్మెల్యేల‌ను కాపాడుకో

Raghunandan Rao warns kcr to save 15 brs mlas

Raghunandan Rao: తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ర‌ఘునంద‌న్ రావు ఛాలెంజ్ విసిరారు. ఇక భార‌త రాష్ట్ర స‌మితిలో కేవ‌లం 15 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలి ఉన్నార‌ని.. రానున్న 15 రోజుల్లో ఆ 15 మంది ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవాల‌ని సూచించారు. ఇంకో 15 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ సెష‌న్లు మొద‌ల‌వుతాయ‌ని అన్నారు. మ‌రో ఐదేళ్ల త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు త‌న‌దేన‌ని ఆ త‌ర్వాత ఇంకో 15 ఏళ్లు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని కేసీఆర్ అన్నారు. దీనిపై ర‌ఘునంద‌న్‌రావు స్పందిస్తూ.. గ‌త 15 ఏళ్ల‌లో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని.. ఇంకో ప‌దిహేను నెల‌లు గ‌డిస్తే అస‌లు భార‌త రాష్ట్ర స‌మితి అనే పార్టీ పేరు కూడా వినిపించ‌ద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల తీర్పును అర్థంచేసుకుని వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఆర్గానిక్ కూర‌గాయ‌లు పండించుకుని హాయిగా తిని ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు హిత‌వు ప‌లికారు.