Raghu Rama: న‌ర‌సాపురం ఎంపీ సీటు ర‌ఘురామ‌కే..!

Raghu Rama: తెలుగు దేశం పార్టీ ర‌ఘురామ కృష్ణంరాజుకు న‌ర‌సాపురం ఎంపీ సీటును ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు బ‌దులుగా తెలుగు దేశం పార్టీ.. పొత్తులో భాగంగా ఉన్న భార‌తీయ జ‌నతా పార్టీకి ఏలూరు సీటును ఇచ్చేసింది. రేపో ఎల్లుండో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. న‌ర‌సాపురం సీటును ముందు తెలుగు దేశం పార్టీ ర‌ఘురామ‌కే ఇవ్వాల‌నుకుంది. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆ సీటును త‌మ నేతకు ఇవ్వాల‌నుకోవ‌డంతో తెలుగు దేశం వెన‌క్కి ద‌క్కింది. దీనిపై గ‌తంలో ర‌ఘురామ మాట్లాడుతూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే త‌న‌కు సీటు రానివ్వ‌కుండా చేసాడ‌ని.. తెలుగు దేశం పార్టీ నిస్స‌హాయ స్థితిలో ఉంద‌ని అన్నారు. ఇప్పుడు ఎలాగోలా కొట్లాడి చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన ర‌ఘురామ‌కు సీటు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.