Raghu Rama Meets Jagan: అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. జ‌గ‌న్‌తో ర‌ఘురామ గుస‌గుస‌లు

Raghu Rama Meets Jagan in assembly

Raghu Rama Meets Jagan: మ‌నం చూసింది చూస్తుంది నిజ‌మేనా అనిపించేలా ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణం రాజు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకున్నారు. స‌భ ప్రారంభానికి ముందు ర‌ఘురామ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రఘురామ జ‌గ‌న్‌తో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ హాజ‌రైతే బాగుంటుంద‌ని ఆయ‌న‌కు చెప్పారు. ఇందుకు జ‌గ‌న్ త‌ప్ప‌కుండా అని చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల పాటు జ‌గ‌న్‌తో ఏవో గుస‌గుస‌లు చెప్పారు. ర‌ఘురామ మాట్లాడి వెళ్లిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ కాస్త సీరియ‌స్‌గా ఉన్నారు. వారి మ‌ధ్య సంభాష‌ణ‌ను బ‌ట్టి చూస్తుంటే జ‌గ‌న్ త‌న‌పై ర‌ఘురామ పెట్టి కేసు గురించి చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.