Raghu Rama: విజ‌య‌న‌గ‌రం ఎంపీగా?

Raghu Rama: న‌ర‌సాపురం టికెట్ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోవ‌డంతో డీలాప‌డిపోయారు ర‌ఘురామ కృష్ణంరాజు. అయినా కూడా తెలుగు దేశం, జ‌న‌సేన‌తోనే నిల‌బ‌డ‌తాన‌ని అన్నారు. కాగా.. ఆయ‌న విజ‌య‌న‌గ‌రం ఎంపీగాగా పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ నేప‌థ్యంలో ర‌ఘు రామ తెలుగు దేశం పార్టీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. మ‌రోప‌క్క ఉండి అనే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఆయ‌న విజ‌య‌న‌గ‌రం నుంచి తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున కాకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఎందుకంటే భార‌తీయ జ‌న‌తా పార్టీలో పేరు మోసిన నేత‌లు లేరు. దాంతో ఏపీలో ఆ పార్టీకి ర‌ఘు రామ కాస్త బ‌లం చేకూరుస్తార‌ని తెలుస్తోంది.