Pawan Kalyan వారాహి యాత్ర స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా

AP: జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర (varahi yatra) రేపు ప్రారంభం కాబోతోంది. ఈ సంద‌ర్భంగా YCP ఎంపీ ర‌ఘురామ కృష్ణరాజు (raghu rama krishna raju) పవ‌న్‌కు విష్ చేసారు. “రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ఆ సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించేందుకు అధ్యక్షులుగారు చేపట్టనున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసారు.

YCP నుంచి న‌ర్సాపురం ఎంపీగా ఎన్నికైన ర‌ఘురామ కొంత‌కాలంగా ఆ పార్టీపై కోపంతో ఉన్నారు. YCPలో చేరే ముందు ఎంపీ సీటు ఇస్తాన‌న్న జ‌గ‌న్ (jagan) తీరా చేరాక త‌డిగుడ్డ‌తో గొంతుకోసాడ‌ని అప్ప‌ట్లో ఆరోపించారు ర‌ఘురామ‌. ఆ సీటును రంగ రాజుకు ఇచ్చారని తెలిపారు. జ‌గ‌న్ మోసాల‌కు బాధితుడిగా మార‌కుండా త‌న‌ను కాపాడింది ప్ర‌శాంత్ కిశోరేన‌ని పేర్కొన్నారు. అలా దాదాపు ఏడాది నుంచి ర‌ఘురామ YCPలో అస‌మ్మ‌త ఎంపీగా ఉన్నారు. చూడ‌బోతే ఆయ‌న జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. YCPకి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన జ‌న‌సేన‌కే (janasena) ఆయ‌న మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మ‌రి ర‌ఘురామ నిర్ణ‌యం ఏంటో ఆయ‌నే వెల్ల‌డించాలి.