AP Election Results: ఆధిక్యంలో ర‌ఘురామ‌.. గెలిచాక స్పీక‌ర్ ప‌ద‌వి?

raghu rama krishna raju to get speaker post after elections

AP Election Results: ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ర‌ఘురామ కృష్ణంరాజు ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మిదే అధికారం అని సుస్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసాక‌.. ర‌ఘురామ‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.