Raghu Rama Krishna Raju: అసెంబ్లీలో జ‌గ‌న్‌పై ర‌ఘురామ సెటైర్

Raghu Rama Krishna Raju satire on jagan mohan reddy

Raghu Rama Krishna Raju: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో స్పీక‌ర్‌గా అయ్య‌న్న‌పాత్రుడు ఎన్నికైన సంద‌ర్భంగా నేత‌లంతా ఆయ‌నపై ప్ర‌శంస‌లు కురిపించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణ‌రాజు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సెటైర్ వేసారు. స్పీక‌ర్‌గా అయ్య‌న్న‌పాత్రుడు ఎంపిక అవుతున్నార‌ని తెలిసి సింహం కూడా పేరు ప‌ల‌క‌లేక‌పోయింద‌ని.. ప‌ప‌ప త‌త‌త స‌స‌స అంటూ భ‌య‌ప‌డి అసెంబ్లీ నుంచి బ‌య‌టికి పారిపోయాడ‌ని ఆయ‌న సెటైర్లు వేసారు. అసెంబ్లీలో కేవ‌లం మంత్రుల‌కే కాకుండా త‌మ లాంటి ఎమ్మెల్యేల‌కు కూడా మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా ర‌ఘురామ అయ్య‌న్న‌పాత్రుడిని కోరారు.