AP Elections: “మేం గెల‌వ‌డానికి PK స‌ల‌హాలు అవ‌స‌రం లేదు”

AP Elections: రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం (TDP), జ‌న‌సేన (janasena) పార్టీలు గెలిచేందుకు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్ (prashant kishore) వ్యూహాలు అవ‌స‌రం లేద‌ని అన్నారు పృథ్వీరాజ్ (prudhvi raj). ప్ర‌జ‌లే YSRCP అవ‌స‌రం లేద‌ని స‌ర్వేలు ఇచ్చేసార‌ని ఇప్పుడు ప్ర‌శాంత్ కిశోర్ వ‌చ్చి కొత్త‌గా స‌ర్వేలు చేయాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. తెలుగు దేశం పార్టీకి 135 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు రావ‌డం ప‌క్కా అని మ‌రో వంద రోజుల్లో ఏపీకి ప‌ట్టిన శ‌ని వ‌దిలిపోతుంద‌ని తెలిపారు.