Priyanka Chaturvedi: ఇండియా కూట‌మి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే

Priyanka Chaturvedi supports jagan mohan reddy dharna

Priyanka Chaturvedi: ఇండియా కూట‌మి మ‌ద్ద‌తు క‌చ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ఉంటుంద‌ని అన్నారు శివ‌సేన యూబీటీ నేత ప్రియాంక చ‌తుర్వేది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని.. తమ కార్య‌క‌ర్త‌లు, పార్టీ నేత‌ల‌ను చంపేస్తున్నార‌ని జ‌గ‌న్ ఈరోజు ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టారు. దాంతో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌తో పాటు ఇండియా కూట‌మిలో ఉన్న ఇత‌ర కీల‌క నేత‌లు ధ‌ర్నాలో పాల్గొని జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్రియాంక చ‌తుర్వేది మాట్లాడుతూ.. “” ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న హింసాత్మ‌క పాల‌న‌ను మా దృష్టికి తీసుకొచ్చినందుకు జ‌గన్ మోహన్ రెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు. రాజ‌కీయ స‌మ‌స్య‌ల స్థానాన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు భ‌ర్తీ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ప్ర‌జ‌స్వామ్యం లేని చోట మ‌నుషులు ఉండ‌లేరు. ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయి పోతుంటాయి. కానీ ఇలా రాజ‌కీయ దాడులు, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు ఉండ‌కూడ‌దు ఈ ధ‌ర్నాలో నా మ‌ద్ద‌తే కాదు మొత్తం ఇండియా కూట‌మి మ‌ద్ద‌తు కూడా జ‌గ‌న్ గారికే ఉంటుంది“” అని తెలిపారు.