Modiపై KTR ట్వీట్‌.. ప్ర‌కాశ్ రాజ్ రిప్లై వైర‌ల్!

Hyderabad: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ (IT minister KTR).. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని(Modi) ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసారు. తెలంగాణ‌లో(Telangana) 9 ఏళ్ల‌లో జ‌రిగిన అభివృద్ధి ఇది అంటూ ఓ నివేదిక‌ను ట్వీట్ చేసారు. అందులో తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన అభివృద్ధి గురించి వివ‌రించారు. దీనిపై కేటీఆర్(ktr) ట్వీట్ చేస్తూ.. “నేను ఎప్ప‌టి నుంచో ఒక విష‌యం అడుగుతున్నాను. తొమ్మిదేళ్ల‌లో తెలంగాణ రాష్ట్రం చేసినంత అభివృద్ధి మ‌రే రాష్ట్ర‌మైనా చేయ‌గ‌లిగిందా అని మోదీజీని(modi) లేదా బాధ్య‌త క‌లిగిన ఏ బీజేపీ(BJP) నేత‌నైనా చెప్పాల్సిందిగా చాలెంజ్ చేసాను. వారి మౌనమే స‌మాధానం చెబుతోంది” అని ట్వీట్ చేసారు. దీనికి ప్ర‌ముఖ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్(prakash raj) స్పందిస్తూ.. “వాళ్లు అబ‌ద్ధాలు మాత్ర‌మే సులువుగా చెప్తారు. అలాంటిది నిజం చెప్ప‌మ‌ని ఎలా అడుగుతారు కేటీఆర్(ktr) గారూ..” అని ట్వీట్ చేసారు.