Prakash Raj: ఓట‌ర్లు ఓడిపోతే ఇలాగే అవుతుంది

Prakash Raj satire on haryana election results

Prakash Raj: విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కొంత‌కాలంగా రాజ‌కీయాల‌పై త‌న అభిప్రాయాల‌ను ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను చెప్పాల‌నుకున్న‌వి, అడ‌గాల‌నుకున్న‌వి మొహమాటం లేకుండా అడిగేస్తుంటారు. తాజాగా ఆయ‌న హర్యాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు. హ‌ర్యాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు చాలా మందికి సర్‌ప్రైజ్‌గా నిలిచాయి.

ఎందుకంటే ఉదయం కౌంటింగ్ మొద‌ల‌య్యే స‌రికి కాంగ్రెస్ మెజారిటీ సీట్ల‌లో ముందంజ‌లో ఉంది. మ‌ధ్యాహ్నానికి వెనుకంజ‌లో ఉంది. చివ‌రికి భార‌తీయ జ‌న‌తా పార్టీ మెజారిటీ సీట్ల‌తో గెలిచింది. దాంతో ప్ర‌ముఖ పొలిటిక‌ల్ కార్టూనిస్ట్ స‌తీష్ ఆచార్య ఓ కార్టూన్ షేర్ చేసారు. కార్టూన్‌లో ఓ రైతు, నిరుద్యోగి, రాహుల్ గాంధీలు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చూస్తూ.. మేం ఎలా ఓడిపోయాం అని.. మ‌రోప‌క్క ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మేం ఎలా గెలిచామ‌ని అయోమ‌యంగా చూస్తున్న‌ట్లుగా ఉంది. ఈ కార్టూన్‌ని ప్ర‌కాష్ రాజ్ రీట్వీట్ చేస్తూ.. ఓట‌రు ఓడిపోతే ఫ‌లితాలు ఇలాగే ఉంటాయి అని సెటైర్ వేసారు.