Telangana: మోసం.. ద‌ర‌ఖాస్తును రూ.80కి అమ్మేస్తున్నారు

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల‌ను ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి కేంద్రాల్లో రూ.80కి అమ్మేస్తున్నారు.  మ‌రోప‌క్క కొన్ని గంట‌ల్లోనే ద‌ర‌ఖాస్తులు అయిపోతుండ‌డంతో గంట‌లు త‌ర‌బ‌డి లైన్‌లో వేచి ఉన్న ల‌బ్దిదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల్సిన ఐదు గ్యారెంటీల‌కు గానూ ప్ర‌భుత్వం ప్ర‌జా పాల‌న పేరిట ఒకే దర‌ఖాస్తును ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ద‌ర‌ఖాస్తులో అన్ని వివ‌రాలు న‌మోదు చేస్తే రావాల్సిన గ్యారెంటీలు వ‌స్తాయి. వీటితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇత‌ర కావాల్సిన ఐడీ ప్రూఫ్‌ల జిరాక్స్‌ల‌కు కూడా ఎక్కువ డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.