Posani: జ‌గ‌న్‌పై ఎటాక్ చేయించింది చంద్ర‌బాబే..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై (jagan) కోడి క‌త్తితో ఎటాక్ చేయించింది చంద్ర‌బాబు నాయుడేన‌ని (chandrababu naidu) అన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి (posani). చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయిన నేప‌థ్యంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు పోసాని. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

“” జ‌గ‌న్‌పై ఎయిర్‌పోర్ట్‌లో ఎటాక్ జ‌రిగింది. ఎయిర్‌పోర్ట్‌లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అంద‌రినీ చెక్ చేసే పంపిస్తారు. మ‌రి ఆ వ్య‌క్తి కోడి క‌త్తితో ఎలా లోప‌లికి రాగ‌లిగాడు. ఆ ఎటాక్ చేసిన వ్య‌క్తి ఓ క్యాంటీన్‌లో ప‌నిచేస్తుంటాడు. ఆ క్యాంటీన్ ఓన‌ర్ TDPకి చెందిన‌వాడు. కావాలంటే క‌నుక్కోండి. జ‌గ‌న్ బ‌ల‌మైన‌వాడు దేవుడి ద‌య‌తో బ‌య‌ట‌పడ్డాడు. ఆ స్థానంలో నేను ఉంటే నేను అప్పుడే పోయేవాడిని “” అని తెలిపారు. (posani krishna murali)

జైలు సూప‌రింటెండెంట్ భార్య చ‌నిపోయింది

“” రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేస్తున్న రాహుల్ భార్య చావుబ‌తుకుల మ‌ధ్య ఉంది. భార్య కోస‌మ‌ని రాహుల్ సెల‌వు పెట్టాడు. కానీ అత‌ను సెల‌వు పెట్టి వెళ్లిన‌ప్ప‌టికీ ఆయ‌న భార్య చ‌నిపోయింది. కానీ ఈ ద‌రిద్రుడు రామోజీ రావు మాత్రం రాహుల్‌ని బ‌ల‌వంతంగా సెలవుపై పంపారని రాసారు. చ‌నిపోయిన ఓ ఆడ‌కూతురితో రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తున్నాడు. రామోజీ చ‌నిపోతే ఆయ‌న కొడుకు వెళ్ల‌డా? కూర్చుని వ‌ర్క్ చేసుకుంటూ ఉంటాడా? ఇలాంటి రాజ‌కీయ వ్య‌భిచారానికి పాల్ప‌డే రామోజీ పురుగులు ప‌ట్టి చ‌స్తాడు “” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు పోసాని.