Posani Krishna Murali: జ‌గ‌న్ ఓడిపోయినందుకే వ‌ర‌ద‌లు

Posani Krishna Murali says vijayawada floods happened because jagan lost

Posani Krishna Murali: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓడిపోయినందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఈ దుస్థితి ప‌ట్టింద‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఒక‌ప్పుడు అధికార పార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీ క‌లిసి ప‌నిచేసేవ‌ని.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన పార్టీ ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేసేందుకు మీడియాను వాడుకుంటున్నార‌ని అన్నారు.

తాను ఎవ‌డికి ప‌డితే వారికి స‌పోర్ట్ చేయ‌న‌ని.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని.. కానీ కాంగ్రెస్ అవినీతికి పాల్ప‌డుతోంద‌ని తెలిసి ఎన్టీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపాన‌ని.. ఆయ‌న పోయాక రాజ‌శేఖ‌ర్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ఉన్నాన‌ని అన్నారు. ఫ‌లానా వ్య‌క్తి మంచి చేస్తాడు అని అనిపిస్తేనే అత‌నికి మ‌ద్ద‌తు ప‌లుకుతాన‌ని.. త‌న‌కు జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని వెల్ల‌డించారు.