Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో తోపులాట‌లు ఎక్కువే.. ప్రేమా ఎక్కువే!

Hyderabad: కాంగ్రెస్ పార్టీలో అభ్య‌ర్ధుల మ‌ధ్య తోపులాట‌లూ ఎక్కువే ప్రేమా ఎక్కువే అని అన్నారు ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy). నిన్న కాంగ్రెస్ (congress) నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఖ‌మ్మంలో స‌భ ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌ల‌వురు కాంగ్రెస్ నేత‌లు రాహుల్ వెన‌క నిల‌బ‌డి నేను ముందుంటా అంటే నేను ముందుంటా అంటూ ఒక‌ర్నొక‌రు తోసుకున్నారు. దీనిపై పొంగులేటి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌లో తోపులాట‌లు ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ‌, ప్రేమా ఎక్కువే అని అన్నారు. జ‌ర‌గబోయే ఎన్నిక‌ల్లో (telangana elections) ఖ‌మ్మంలో 10కి 10 కాకుండా 100 సీట్లు కాంగ్రెస్‌కే వ‌స్తాయ‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు పొంగులేటి.