Ponguleti: త‌ప్పు స‌రిదిద్దుకుంటారా.. స‌రిచేయ‌మంటారా?

Ponguleti Srinivas Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప‌లు శాఖ‌ల అధికారుల‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రెవెన్యూ, ఇరిగేష‌న్, మున్సిప‌ల్ ఇలా ప‌లు శాఖ‌ల అధికారుల‌తో పొంగులేటి మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించి త‌న‌కు చాలా విష‌యాలు తెలిసాయ‌ని అవ‌న్నీ అధికారులే స్వ‌యంగా త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి చెప్తే తానే స‌రిదిద్దుతాన‌ని అలా కాకుండా త‌ప్పులను ఇలా కొన‌సాగిస్తే తానే స‌రిదిద్దాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వంలో ఒత్తిళ్ల‌కు లొంగి త‌ప్పులు చేసినా క్ష‌మిస్తాను కానీ వాటిని స్వ‌యంగా స‌రిదిద్దుకోక‌పోతే మాత్రం ప‌నిష్మెంట్ ఉంటుంద‌ని చెప్పారు.