Attack On Jagan: జాగ్ర‌త్త జ‌గ‌న‌న్నా.. రాజ‌కీయ నేత‌ల స్పంద‌న‌

Attack On Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై ఇత‌ర పార్టీల రాజ‌కీయ నేత‌లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మండిప‌డుతున్నారు.

ఎంకే స్టాలిన్ – నేను జ‌గ‌న్‌పై జ‌రిగిన ఈ దాడికి ఖండిస్తున్నాను. రాజ‌కీయాలు ఎప్పుడూ హింసాత్మకంగా ఉండ‌కూడ‌దు. జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను

కేటీఆర్- నీకు ఏమీ కానందుకు సంతోషంగా ఉంది. జాగ్ర‌త్త జ‌గ‌న‌న్నా. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు చోటు లేదు. ఈ ఘ‌ట‌న‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భావిస్తున్నాను.

విజ‌య సాయి రెడ్డి – విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈరోజు సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు ఏనాడూ అభివృద్ధిని నమ్ముకుని రాజకీయాలు చేయలేదు. హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నాడని మరోసారి నిరూపణ అయింది.

అంబ‌టి రాంబాబు – జగనన్నకు అయిన గాయం. తెలుగు ప్రజలకు అయిన గాయం. బాబు మూల్యం చెల్లించక తప్పదు.

పోసాని కృష్ణ‌ముర‌ళి- ఎన్నికల్లో గెలవడానికి జగన్ని అంతమొదించే కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు