Pilli Subhash Chandra Bose: ఫోన్ చేసి అడిగితే పార్టీ మార‌తానో లేదో చెప్తా క‌దా

Pilli Subhash chandra Bose

Pilli Subhash Chandra Bose: వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిల్లి సుభాష్ చంద్ర బోస్ పార్టీ మార‌నున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌భ పత్రిక ప్ర‌చురించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌భ ప‌త్రిక‌కు మంచి పేరుంద‌ని ఇలాంటి చెత్త వార్త‌లు రాసి ఎందుకు పేర చెడ‌గొట్టుకుంటున్నార‌ని ప్రశ్నించారు.

“” నాకు రాజశేఖ‌ర్ రెడ్డి కుటుంబం రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చింది. ఆ కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ముందు నుంచీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వెంటే ఉన్నాను. ఇప్పుడు ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ వెంటే ఉంటాను. నేను పార్టీ మార‌డం అనేది క‌ల‌లో కూడా ఊహించుకోలేను. అలాంటిది మీరు ఎలా నిర్ణ‌యిస్తారు? నేను ఎప్పుడూ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు అందుబాటులో ఉంటాను. మీరు వార్త రాసే ముందు ఒక్క‌సారి నాకు ఫోన్ చేయ‌చ్చు క‌దా? అడిగితే పార్టీ మార‌తానో లేదో నేనే చెప్తా క‌దా. నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు నేను వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉంటాను“” అని స్ప‌ష్టం చేసారు