Perni Nani: నేను, జగన్ మరణిస్తే..మా శవాలు ఏపీలోనే.!

Perni Nani: YSRCP నేత పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేసారు. పార్టీలో ఉన్న‌వారు ఎవ్వ‌రూ కూడా ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తారా లేదా అనే ఉద్ద‌శంలో లేర‌ని.. త‌మ‌కు సీటు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) బాగుంటే చాలు అనుకుంటామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు నాయుడులాగా (chandrababu naidu) ఏపీ నుంచి తెలంగాణ‌కు తెలంగాణ నుంచి ఏపీకి మ‌కాం మార్చ‌మ‌ని.. తాను జ‌గ‌న్ మ‌ర‌ణిస్తే త‌మ శ‌వాలు ఏపీలోనే పూడ్చిపెట్టాల‌ని అన్నారు.

YSRCP నేత‌లంతా మోస‌గాళ్లు అయిన‌ప్పుడు స‌స్పెండ్ చేసిన వారిని ఎందుకు TDPలో చేర్చుకున్నార‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan) ల‌క్ష్యం ఏపీ ప్ర‌జ‌ల బాగు కాదని… కేవ‌లం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అధికారం నుంచి దించాల‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. జ‌న‌సేన పార్టీని ప‌వ‌న్ TDPకి లాంగ్ లీజ్‌కి ఇచ్చారని.. వారు రాజ‌కీయాలు ఏపీలో చేస్తూ ఓట్లు మాత్రం తెలంగాణ‌లో వేస్తున్నార‌ని మండిప‌డ్డారు.