Payyavula Keshav: ఈ 2 రోజులు వైసీపీ నేత‌లు బ‌య‌టికి రావ‌ద్దు

Payyavula Keshav requests ysrcp leaders not to come out

Payyavula Keshav: మ‌రో రెండు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు బ‌య‌టికి రావ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్.  వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కావాల‌నే బ‌య‌టికి వ‌చ్చి షో చేసి ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పుట్టిస్తున్నార‌ని ఆరోపించారు. వ‌ర‌ద‌ల నుంచి జ‌నాల‌ను రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చంద్ర‌బాబు నాయుడుకి ఆయ‌న టీంకి బాగా తెలుస‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఇంట్లో ఉంటే మంచిద‌ని అన్నారు. జ‌గ‌న్ ఎటూ రేపు లండ‌న్ పోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. ఆ పోయేదేదో ఈరోజే వెళ్తే మ‌రీ మంచిద‌ని.. వెళ్లి వారంలో తిరిగి రాకుండా ఒక సంవ‌త్స‌రం పాటు అక్క‌డే ఉంటే ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటార‌ని ఎద్దేవాచేసారు.