ప‌వ‌న్.. ఇప్పుడు చ‌క్ర‌వ‌డ్డీతో స‌హా తిరిగి ఇచ్చేయండి..!

AP: ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారూ.. ఇప్పుడు చక్ర‌వ‌డ్డీతో స‌హా తిరిగివ్వండి అంటూ YSRCP నేత ర‌ఘు రామ‌కృష్ణ రాజు (raghu ramakrishna raju) చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న త‌ణుకులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan) అన్న వ్యాఖ్య‌ల‌కు స్పందిస్తూ రాఘు రామ‌కృష్ణ ట్వీట్ చేసారు. ఇంత‌కీ ప‌వ‌న్ ఏమ‌న్నారంటే.. జ‌గ‌న్ అంద‌రినీ బూతులు తిట్టిస్తారు. వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రూ ఒక్కో డైమండ్. వారు ఏమైనా మాట్లాడొచ్చు. నేను ఒక్క జ‌గ‌న్‌ని అంటే మాత్రం వారికి పొడుచుకొచ్చేస్తుంది. ఇప్పుడు జ‌గ‌న్ నుంచి జ‌గ్గూ భాయ్ అంటున్నా. ఇంకా మాట్లాడితే జ‌గ్గూ అంటా. అంత‌కంటే ఎక్కువ మాట్లాడితే ఇంకేమ‌ని పిలుస్తానో నాకే తెలీదు అన్నారు.

దీనిపై ర‌ఘు రామ‌కృష్ణ (raghu ramakrishna raju) స్పందిస్తూ..” జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరు జారటం ఖాయం! ప‌వ‌న్ కళ్యాణ్‌ గారు.. మీరు ఊరుకోరు అన్నది కూడా ఖాయమే! ఇన్నాళ్లూ భరించారు..ఇప్పుడు చక్ర వడ్డీతో తిరిగి ఇవ్వండి!! అని అన‌డం వైర‌ల్ అవుతోంది. ఎప్ప‌టినుంచో ర‌ఘు రామకృష్ణ రాజు YSRCP అస‌మ్మ‌తి నేత‌గా ఉంటున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న జ‌న‌సేన‌లో (janasena) చేరే అవ‌కాశాలు కూడా క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. అదెప్పుడు అనేది ఆయ‌నే చెప్పాలి.