Pawan Kalyan: ప్రచారానికి జనసేనుడు, వారాహి సిద్ధం..!

AP: జనసేన (jenasena) నాయకులు, అభిమానులకు.. గుడ్ న్యూస్ వచ్చేసింది. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనసేనుడి (pawan kalyan) ఎన్నికల ప్రచార వాహనం ఎట్టకేలకు రోడ్డు ఎక్కేందుకు సిద్దమైంది. ఇక తొలి విడతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల రెండో వారంలో పవన్ పర్యటించానున్నారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలను జనసేన పార్టీ pac చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ సాయంత్రం వెల్లడించనున్నారు. యాత్ర ఎన్ని రోజులు చేస్తారు, ఎంతసేపు ప్రజలతో గడుపుతారు అన్నది కూడా ఇవాళ సాయంత్రం స్పష్టం కానుంది.

గోదావరి జిల్లాలపై ఫోకస్..

పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సర్వే సంస్థను సంప్రదించిన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో వున్న అంశం.. ఏంటంటే పార్టీ (jenasena) ఎక్కడెక్కడ బలంగా వుంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారు అన్న విషయాలను పవన్ సర్వే సంస్థ నుంచి రాబట్టినట్టు సమాచారం. దీని ప్రకారం పవన్ సామాజిక వర్గం కాపులు ఎక్కువగా వున్న ప్రాంతలైన ఉభయ గోదావరి జిల్లాను తొలి విడత వారాహి యాత్రకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ జిల్లాలో పర్యటిస్తే మంచిది అని పవన్ కూడా భావిస్తున్నారు. ఇక పవన్ పై మరో అంశం కూడా ప్రస్తుతం పబ్లిక్ లో నానుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పటికి స్పష్టత లేదు. దీంతో వారాహి (varahi) యాత్ర సందర్బంగా పవన్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది ప్రకటించే అవకాశం కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముందస్తుకు సంకేతమా…?

APలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ యాత్ర చేస్తానని ప్రకటించడంతో ముందస్తు అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఏది ఏమైనా పవన్ ప్రజల్లోకి వస్తున్నారు అన్న విషయం తెలియడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.