NDA Meet: BJP హై క‌మాండ్ నుంచి పిలుపు.!

AP: ఈ నెల 18న దిల్లీలో జ‌ర‌గ‌నున్న NDA స‌మావేశానికి (nda meet) జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) హాజ‌రుకానున్నారు. ఆయ‌న‌కు ఆహ్వానం అందిన‌ట్లు జ‌న‌సేన (janasena) ప్ర‌క‌టించింది. NDAలో భాగ‌స్వామ్యులైన ప్ర‌తిప‌క్ష నేత‌లు హాజ‌రుకానున్న ఈ స‌మావేశానికి ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) కూడా వెళ్ల‌నున్నారు. వీరిద్ద‌రూ ఈ నెల 17న సాయంత్రం దిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ స‌మావేశానికి హాజ‌రుకావాల‌ని కొన్ని రోజుల క్రిత‌మే BJP హైకమాండ్ నుంచి పిలుపు అందింద‌ని జ‌న‌సేన తెలిపింది.