Pawan Kalyan: న‌న్ను అడ్డుకున్నారు.. బాధితుల‌ను క‌ల‌వ‌లేక‌పోయా

Pawan Kalyan reveals the reason behind not going to flood affected areas

Pawan Kalyan: విజ‌య‌వాడ వ‌ర‌దల కార‌ణంగా దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఓ ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు ప‌వ‌ర్ స్టార్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదేంటి అని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌ను రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో చెప్పారు.

తాను వ‌ర‌ద ప్రాంతాల‌కు వ‌చ్చి బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తాను అని స‌హాయ‌క సిబ్బందికి చెప్పినప్పుడు మీరు వ‌స్తే ప్రాబ్లం అవుతుంది స‌ర్. అంద‌రూ వ‌ర‌ద‌లు అన్న సంగ‌తి మ‌ర్చిపోయి గుమిగూడ‌తారు. అప్పుడు రిలీఫ్ ఆప‌రేషన్లు చేయలేం అని చెప్పార‌ట‌. అందుకే ఆగిపోయాన‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కోటి విరాళంగా ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.