TDP Janasena: YSRCPని ఇబ్బందిపెట్టం

pawan kalyan press meet after winning in ap elections

TDP Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తాము గెలిచాం క‌దా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేత‌ల‌ను ఇబ్బందిపెట్ట‌బోమ‌ని అన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గెలుపు అనంత‌రం ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టారు. 23కి 23 సీట్లు గెలిచిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు తన‌పై 175 సీట్లు గెలిచినంత బాధ్య‌త పెట్టార‌ని అన్నారు. ఇచ్చిన ప్రతీ మాట‌ను నెర‌వేర్చి తీర‌తామ‌ని తెలిపారు. త‌న‌కు రాజ‌కీయాల నుంచి వచ్చే డ‌బ్బు అవ‌స‌రం లేద‌ని.. ఇక నుంచి రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను బ‌లంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు. పిఠాపురం కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గెలిపించ‌లేద‌ని.. ఐదు కోట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను గెలిపించార‌ని చెప్పారు. ఓడిపోతేనే ఎంతో బ‌లంగా నిల‌బ‌డ్డాన‌ని.. ఇక గెలిస్తే ప్ర‌జ‌ల‌కు ఇంకెంత నిల‌బ‌డ‌తానో ప్ర‌జ‌లే చూస్తార‌ని వెల్ల‌డించారు.