AP Elections: “ప‌వ‌న్‌ను రెండున్న‌రేళ్లు సీఎంగా ఉంచాల్సిందే”

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ తెలుగు దేశం పార్టీ (TDP), జ‌న‌సేన (janasena) పార్టీలు అధికారంలోకి వ‌స్తే సీట్ల షేరింగ్‌తో పాటు ప‌వ‌ర్ షేరింగ్ కూడా స‌మానంగా ఉండాల‌ని అంటున్నారు మాజీ మంత్రి, ప‌వ‌న్ గురువు హ‌రిరామ జోగయ్య‌ (harirama jogayya). ఈరోజు సాయంత్రం ప‌వ‌న్, చంద్ర‌బాబు నాయుడు డిన్న‌ర్ మీట్‌లో క‌ల‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రిరామ జోగ‌య్య చెప్పిన అంశాల‌పై ప‌వ‌న్ చంద్ర‌బాబుతో చ‌ర్చించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో 40 నుంచి 60 సీట్లు తీసుకుంటే బాగుంటుంద‌ని కూడా సూచించారు.  అంతేకాదు.. భార‌తీయ జ‌న‌తా పార్టీని కూడా త‌మ‌తో క‌లుపుకుంటే బాగుంటుంద‌ని హ‌రిరామ జోగయ్య ప‌వ‌న్‌తో చెప్పారు. ఈ విష‌యం గురించి కూడా ప‌వ‌న్ చంద్ర‌బాబుతో మాట్లాడ‌నున్నారు.