AP Assembly: చంద్ర‌బాబు ప్ర‌సంగం.. ప‌వ‌న్ న‌వ్వులు

pawan kalyan laughs in ap assembly as chandrababu naidu talks about his protest on road

AP Assembly: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈరోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన అరాచ‌కాల‌పై శ్వేత‌ప‌త్రాన్ని రిలీజ్ చేసారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పెట్టిన కేసుల గురించి ప్ర‌స్తావించారు.

త‌న‌పై ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌యంలో ప‌బ్లిక్ మీటింగ్ కోసం వెళ్తే అప్పుడేదో చిన్న కేసు పెట్టారే త‌ప్ప చిన్న‌ప్ప‌టి నుంచి తాను ఎలాంటి కేసులు ఎరుగ‌న‌ని.. అలాంటిది జ‌గ‌న్ త‌న‌పై ఏకంగా 17 త‌ప్పుడు కేసులు బ‌నాయించాడ‌ని అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌ను ఇంట్లో నుంచి క‌ద‌ల‌నివ్వ‌కుండా చేసాడ‌ని తెలిపారు. ఇక త‌న‌ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తుండ‌గా… న‌డిరోడ్డుపై నిలిపేసార‌ని.. దాంతో ఆయ‌న రోడ్డుపై ప‌డుకుని మ‌రీ నిర‌స‌న తెలిపార‌ని చంద్ర‌బాబు ఫోటోల‌ను చూపిస్తుండ‌గా.. ప‌వ‌న్‌తో పాటు అసెంబ్లీలో ఉన్న ఇత‌ర నేత‌లు కూడా న‌వ్వుకున్నారు.