Pawan Kalyan: ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మ‌ణ‌.. తిరుమ‌ల‌కు ప‌వ‌న్

pawan kalyan breaks his penance deeksha in tirumala

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప్రాయ‌శ్చిత్త దీక్ష‌ను విర‌మించుకోనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న తిరుమ‌ల చేరుకోనున్నారు. శ్రీవారిని దర్శించుకుని తన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించుకునేందుకు కొద్దిసేపటి క్రితం తిరుమలకు బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అలిపిరి చేరుకొని, అలిపిరి నుండి కాలినడకన తిరుమల కొండ ఎక్కనున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యం సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం.. సుప్రీంకోర్టు ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగింద‌న్న విష‌యంపై ఆధారాలు లేవు అన‌డంతో ప‌వ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.