Pawan kalyan ఓటర్ల‌నే నిందిస్తున్నారు..!

Hyderabad: జ‌న‌సేన(janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) ఓట‌ర్ల‌నే నిందిస్తున్నార‌ని కామెంట్స్ చేసారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(ram gopal varma). గ‌త ఎన్నిక‌ల్లో తాను గెల‌వ‌క‌పోవ‌డానికి ఓట్లు ప‌డ‌క‌పోవ‌డ‌మే అని ప‌వ‌న్ మొన్న జ‌రిగిన మీటింగ్‌లో చెప్పారు. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేసారు. “తను, త‌న పార్టీ గెల‌వ‌క‌పోవ‌డానికి ఓట‌ర్లే కార‌ణ‌మ‌ని ప‌వ‌న్ వారిని నిందిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే.. సినిమా ఆడ‌క‌పోవ‌డానికి ఆడియ‌న్స్ కార‌ణం అన్న‌ట్లుంది. ఇంకా చెప్పాలంటే.. త‌న ప్రొడ‌క్ట్ కొనలేద‌ని త‌యారీదారు క‌స్ట‌మ‌ర్‌నే నిందించిన‌ట్లుంది” అని పొద్దునే ప‌వ‌న్ మీద‌పడ్డారు వ‌ర్మ‌.