Pawan Kalyan: వైసీపీ నేత‌లు నాతో పాటు కారులో వ‌స్తే తెలుస్త‌ది

pawan kalyan asks ysrcp leaders to work with him

Pawan Kalyan: ఒక ప్ర‌భుత్వంపై నింద‌లు వేయ‌డం చాలా సుల‌భం అని కానీ ప‌క్క‌న ఉండి చూస్తే అప్పుడు తెలుస్తుంద‌ని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో మాట‌లు చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌తో విల‌విల‌లాడుతుంటే క‌నీసం వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఇత‌ర నేత‌లైన రోజా, కాకాణి గోవ‌ర్ధ‌న్ త‌దిత‌రులు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసారు. దీనిపై ప‌వ‌న్ స్పందిస్తూ.. ఇంట్లో కూర్చుని లైవ్ వీడియోల్లో మాట్లాడ‌టం చాలా సుల‌భం అని.. ఒక‌వేళ వైసీపీ నేత‌ల‌కు ఓకే అయితే త‌న కాన్వాయ్‌లో కూర్చోపెట్టుకుని స్వ‌యంగా తీసుకెళ్తాన‌ని అప్పుడు వారికి తెలుస్తుంద‌ని సెటైర్ వేసారు. ఈ స‌మ‌యంలో రాజ‌కీయం చేయ‌కుండా మ‌న రాష్ట్రానికి వ‌చ్చిన క‌ష్టం అని భావించి డ‌బ్బులు సాయం చేస్తే బాగుంటుంద‌ని అన్నారు. ఈ గ్యాప్‌లో ఓ విలేక‌రి జ‌గ‌న్ కోటి వ‌ర‌కు సాయం చేసారు స‌ర్ అని చెప్ప‌గా.. ఆ మంచిది. చేస్తే మంచిదే అని ప‌వన్ అన్నారు.