Pawan Kalyan: మహిళల మిస్సింగ్ కేసులపై రివ్యూ మీటింగ్ ఏది??

AP: మహిళల మిస్సింగ్ కేసులపై రివ్యూ మీటింగ్ ఏది జగన్ అని ప్ర‌శ్నించారు జ‌న‌సేనాని ప‌వ‌న కళ్యాణ్‌ (pawan kalyan). ఏపీ వాలంటీర్ల వ్య‌వ‌స్థ (ap volunteers) బాలేద‌ని, ప‌లువురు వాలంటీర్ల వ‌ల్ల దాదాపు 18 వేల మంది అమ్మాయిలు క‌నిపించ‌కుండాపోయార‌ని ప‌వ‌న్ (pawan kalyan) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి ఏపీ స‌ర్కారు స‌మాధానం చెప్ప‌క‌పోగా.. ప‌వ‌న్‌కు మ‌హిళా క‌మిష‌న్ ద్వారా నోటీసులు జారీ చేయించింది.

ఆరోప‌ణ‌లు చేసి మూడు రోజులు అవుతున్నా ఇప్ప‌టివ‌ర‌కు మిస్సింగ్ కేసుల‌పై జ‌గ‌న్ రివ్యూ మీటింగ్ పెట్ట‌క‌పోవ‌డంపై జ‌న‌సేన ప్ర‌శ్న‌లు గుప్పిస్తోంది. 3 ఏళ్ల‌లో దాదాపు 33 వేల మంది మ‌హిళ‌లు క‌నిపించ‌కుండాపోతే ఇప్ప‌టి వ‌ర‌కు రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్ట‌లేదు అని అడిగింది. నిజాలు మాట్లాడ‌గానే నోటీసులు పంపే ఏపీ మ‌హిళా క‌మిష‌న్ అది అబ‌ద్ధ‌మ‌ని రుజువు చేయ‌డానికైనా స్పందించాలి క‌దా అని నిల‌దీసారు ప‌వ‌న్. మ‌హిళా క‌మిష‌న్ మ‌హిళ‌ల కోస‌మా? నిందితుల ప‌క్షాన నిల‌బ‌డ‌టం కోస‌మా? అంటూ మండిప‌డ్డారు జ‌న‌సేనాని.