Pawan Kalyan: మ‌రో సీటును ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు మ‌రో సీటును ప్ర‌క‌టించారు. విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ స్థానం అభ్య‌ర్ధిగా వంశీ కృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌ను ఎంపిక‌చేసారు. దాంతో శ్రీనివాస్ యాద‌వ్ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వంశీ కృష్ణ గ‌తంలో ప్ర‌జా రాజ్యం త‌రఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరారు. ఇటీవ‌ల ఆయ‌న వైసీపీకి గుడ్ బై చెప్పి జ‌న‌సేన‌కు వ‌చ్చారు. విశాఖ ద‌క్షిణ స్థానం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా కృషి చేసారు. మొద‌ట విశాఖ సౌత్ తెలుగు దేశం పార్టీకి ఇచ్చి భీమిలి తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ ఇందుకు తెలుగు దేశం పార్టీ ఒప్పుకోలేదు.