Pawan Kalyan: మీరు గెలుస్తార‌ని నేను త‌గ్గాను

Pawan Kalyan: ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్కడ త‌గ్గాలో తెలిసినోడే గొప్ప అని మ‌రోసారి అత్తారింటికి దారేది డైలాగ్ కొట్టారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భాగంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో (Chandrababu Naidu) పాటు ప‌వ‌న్ త‌ణుకులో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. చాలా మంది జ‌న‌సేన పార్టీ వెన‌క్కి త‌గ్గి సీట్లు తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు ఇచ్చేసింద‌ని అంటున్నార‌ని.. తాను తగ్గింది జ‌న‌సేన పార్టీని కించ‌ప‌ర‌చాల‌ని కాద‌ని.. తాను ఒక అడుగు వెన‌క్కి వేసి త‌గ్గితే చివ‌ర‌కు గెలిచేది ప్ర‌జ‌లే అన్న ఉద్దేశంతో తాను త‌గ్గాన‌ని అన్నారు.