ఇంకా బ‌య‌ట‌కు రాని క‌విత‌.. BRS నేత‌ల్లో ఆందోళ‌న‌

లిక్క‌ర్ స్కాంలో భాగంగా రెండో సారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన BRS ఎమ్మెల్సీ క‌విత క‌ల్వ‌కుంట్ల ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈరోజు ఉద‌యం 11 గంట‌లకు మొద‌లైన విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికీ క‌విత బ‌య‌టికి రాక‌పోవ‌డంతో BRS నేతల్లో ఆందోళ‌న నెల‌కొంది. PMLA సెక్ష‌న్ 50 కింద ఈడీ క‌విత‌ను విచారిస్తోంది. క‌విత విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ అద‌న‌పు ఏజీ దిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు.