Pakistan: రాజ్‌నాథ్ కామెంట్.. పాక్ రియాక్ష‌న్!

Hyderabad: కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) చేసిన కామెంట్స్‌కు పాకిస్థాన్ (pakistan)  స్పందించింది. నిన్న కార్గిల్ దివ‌స్ (kargil diwas) సంద‌ర్భంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తాం. అవ‌స‌ర‌మైతే LOCని కూడా దాట‌గ‌లం అని అన్నారు. దీనికి పాక్ స్పందిస్తూ.. ఆయ‌న కామెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయ‌ని తెలిపింది. భార‌త్ ఎలాంటి రెచ్చ‌గొట్టే ప‌నుల‌కు పాల్ప‌డినా త‌మ దేశాన్ని కాపాడుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొంది.

“” భార‌త‌దేశానికి ఓ స‌ల‌హా ఇవ్వాల‌నుకుంటున్నాం. భారత్‌ యుద్ధ వాక్చాతుర్యం ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు ముప్పు క‌లిగించే విధంగా ఉంది. దక్షిణాసియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని అస్థిరపరిచే అవ‌కాశం ఉంది. కాబట్టి మాట్లాడేట‌ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం “” అని ట్వీట్ చేసింది. గ‌తంలోనూ భార‌తదేశ మంత్రులు, రాజ‌కీయ నేత‌లు ఇలాంటి రెచ్చ‌గొట్టే కామెంట్స్ చేసార‌ని పాక్ ఆరోపించింది.