Ayodhya: “రామ భ‌క్తుల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు”

Ayodhya: అయోధ్య రామ‌మంద‌రింలో ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి కేవ‌లం రామ‌య్య భ‌క్తుల‌ను మాత్ర‌మే ఆహ్వానిస్తున్న‌ట్లు ఆల‌య పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్ తెలిపారు. శివ‌సేన అధినేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు (uddhav thackeray) ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అంద‌లేదు. దీనిపై ఆచార్య స్పందిస్తూ.. ఆహ్వానం అంద‌లేదు అంటే వారు భ‌క్తులు కార‌ని అందుకే ఆహ్వానించ‌లేద‌ని అనుకోవాల‌ని ఆచార్య అన్నారు.