Rajaiah: ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అన్నారు

స్టేషన్ ఘనపూర్ BRS సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (rajaiah) రెండు రోజుల క్రితం మంత్రి KTRను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. స‌మావేశంలో క‌డియం శ్రీహ‌రి (kadiyam srihari) కూడా ఉండ‌గా.. వీరంతా క‌లిసి దిగిన ఫోటో బ‌య‌టికి వ‌చ్చింది. క‌డియంకు త‌న పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు రాజ‌య్య అన్న‌ట్లు కూడా వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేద‌ని రాజయ్య తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ విష‌యంలో తగ్గేదేలేద‌ని అంటున్నారు. KTRను కలిస్తే త‌న‌కు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామ‌ని చెప్పార‌ని అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకోమని చెప్పారని తెలిపారు. KTRను కలవడానికి వెళ్తే అక్కడ శ్రీహరి ఉన్నారని, అదే సమయంలో ఫొటో తీశారని ఆ ఫోటో వెన‌క ఉన్న అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు రాజ‌య్య‌.