Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ కేసులో కొత్త ట్విస్ట్

New twist In MLC Duvvada Srinivas Family Episode

Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. మొన్న‌టివ‌ర‌కు త‌న‌కు భ‌ర్త అవ‌స‌రం లేద‌ని.. ఆయ‌న ఉంటున్న ఇంటిని త‌మకు రాసిస్తే త‌న బ‌తుకు తాను బ‌తుకుతాన‌ని భార్య దువ్వాడ వాణి ఆరోపించింది. ఆ త‌ర్వాత శ్రీనివాస్ దివ్వెల మాధురిని తీసుకుని టెక్క‌లి వ‌దిలేసి ఎక్క‌డికైనా వెళ్లిపోవాల‌ని డిమాండ్ చేసింది. దీనిపై శ్రీనివాస్ స్పందిస్తూ.. త‌న‌కు మిగిలి ఉంది తాను ప్ర‌స్తుతం ఉంటున్న ఇల్లు మాత్ర‌మే అని అది రాసివ్వ‌డానికి తాను అస్స‌లు ఒప్పుకోన‌ని తేల్చి చెప్పేసాడు.

ఇప్పుడు ఈ కేసులో మ‌రో ట్విస్ట్ బ‌య‌టికి వ‌చ్చింది. దువ్వాడ వాణి మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌కు త‌న భ‌ర్త కావాల‌ని అంటున్నారు. త‌న భ‌ర్త ఎలా కావాలంటే అలా ఉండొచ్చ‌ని.. కానీ త‌న‌తో క‌లిసి ఉంటే చాల‌ని.. ఇదివ‌ర‌క‌టిలా అంద‌రం క‌లిసి ఉందామ‌ని అంటున్నారు. త‌న‌కు ఈ రాజ‌కీయాలు, ఆస్తులు అక్క‌ర్లేద‌ని అన్నారు. శ్రీనివాస్ త‌ల్లిదండ్రులు, సోద‌రుడే త‌న కాపురంలో నిప్పులు పోస్తున్నార‌ని ఆరోపించారు. ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చాక శ్రీనివాస్‌కి అహంకారం పెరిగింద‌ని అందుకే కుటుంబాన్ని కోల్పోతున్నాడ‌ని అన్నారు. మ‌రి ఆల్రెడీ వాణికి విడాకుల నోటీస్ పంపించిన శ్రీనివాస్ ఈ డిమాండ్‌కి ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.