జ‌గ‌న్‌కు షాక్‌.. తాడేప‌ల్లి ప్యాలెస్ ముందు నో రూల్స్

new shock to jagan mohan reddy from ap government

Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్ల పాటు ర‌హదారిని దిగ్భందించి త‌న తాడేప‌ల్లి ప్యాలెస్ కోసం వాడుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాంతో తాడేప‌ల్లిలోని జ‌నాల‌కు రాక‌పోక‌లు చాలా క‌ష్ట‌మ‌య్యాయి. ర‌హ‌దారి వైపు పొర‌పాటున వెళ్లిన వారిని పోలీసులు హెచ్చ‌రించేవారు. ఇక‌పై జ‌నాల‌కు ఆ క‌ష్టం ఉండ‌కూడ‌ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ నివ‌సిస్తున్న తాడేప‌ల్లి ప్యాలెస్ ముందు ఆంక్ష‌ల‌ను తొల‌గించేసారు. ఆ ఆంక్ష‌లు తొల‌గించ‌డంతో మంగ‌ళ‌రి నుంచి తాడేప‌ల్లి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు 4 లేన్ల ర‌హ‌దారి అందుబాటులోకి వ‌చ్చింది. నిన్న రాత్రి నుంచి విద్యార్థులు, రైతులు, కూలీల‌కు ఈ ర‌హ‌దారి అందుబాటులోకి వ‌చ్చింది. ర‌హ‌దారి అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.