Neelam Madhu: BRS, కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసాయి

Telangana Elections: ప‌టాన్‌చెరు టికెట్ ఇవ్వకుండా మొన్న BRS మోసం చేస్తే, ఇవ్వాల టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ (congress) మోసం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేసారు నీలం మ‌ధు (neelam madhu). ముదిరాజులు దామోదర రాజనర్సింహకు ముదిరాజులు ఒక్క ఓటు కూడా వేయకండి అని కార్య‌క‌ర్త‌లు నీలం మ‌ధు పిలుపునిచ్చారు.

పటాన్‌చెరు (patancheru) నియోజకవర్గంలో ఇరు పార్టీల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఓ ప‌క్క కాంగ్రెస్ (congress) నీలం మధుకు (neelam madhu) టికెట్ ఇచ్చినట్లు అధిష్టానం ప్రకటించింది. కానీ ఇంత‌వ‌ర‌కు ఆయ‌న‌కు బీ ఫాం మాత్రం ఇవ్వలేదు. దాంతో ఆయ‌న మొన్న గాంధీ భ‌వ‌న్ నుంచి అలిగి వెళ్లిపోయారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్ భార్య, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా (kaata sudha) నామినేష‌న్ వేసారు. ఆమె ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.