ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం మోదీ సంత‌కం ఆ ఫైల్ మీదే

narendra modi signs on farmers welfare scheme

Narendra Modi: నిన్న న‌రేంద్ర మోదీ మూడోసారి భార‌త ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం ప్ర‌ధాని హోదాలో ఆయ‌న తొలి ఫైల్‌పై సంత‌కం చేసారు. రైతుల సంక్షేమానికి సంబంధించిన పీఎం కిసాన్ నిధి ఫైల్‌పై ఆయ‌న తొలి సంత‌కం చేసిన‌ట్లు ప్ర‌ధాని అధికారిక కార్యాల‌యం వెల్ల‌డించింది. ఇందుకోసం దాదాపు రూ.20 వేల కోట్ల నిధులు రిలీజ్ చేసారు.

ఇక మోదీకి చెందిన నూత‌న కేబినెట్ తొలి స‌మావేశం ఈరోజు సాయంత్రం లోక్ క‌ళ్యాణ్ మార్క్‌గో జ‌ర‌గ‌నుంది. 70 మంది ఉన్న మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి.. ఆంధ్రప్ర‌దేశ్ నుంచి రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌లు ఉన్నారు.