Narendra Modi: తెలంగాణ‌కు ప్ర‌ధాని వ‌రాలు

రానున్న తెలంగాణ ఎన్నిక‌ల (telangana elections) నేప‌థ్యంలో ఈరోజు ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్ర‌సంగించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వ‌ర్చువ‌ల్‌గా జాతీయ ర‌హ‌దారులు, రైల్వే వంటి అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణకు పసుపు బోర్డు ప్రకటించారు. ములుగు జిల్లాకు 900 కోట్లతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామ‌ని యూనివర్సిటీ పేరును సమ్మక్క సారక్కగా పెడతామంటూ హామీ ఇచ్చారు. మోదీ కంటే ముందు తెలంగాణ BJP జాతీయ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (kishan reddy) మాట్లాడుతూ.. సీఎం KCRపై మండిపడ్డారు. అభివృద్ధి ప‌నుల కోస‌మ‌ని మోదీ ఎప్పుడు తెలంగాణ‌కు వ‌చ్చినా క‌నీసం నామ‌మాత్రంగా కూడా KCR రావ‌డంలేద‌ని విమ‌ర్శించారు.