Modi: నేపాల్‌కు అండ‌గా ఉంటాం.. ప్ర‌ధాని భ‌రోసా

Nepal Earthquake: నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 120 మందికి పైగా మృత్యువాత‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) నేపాల్‌కు అండ‌గా ఉంటామ‌ని ట్విట‌ర్ ద్వారా తెలిపారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. నేపాల్‌లో నిన్న రాత్రి రిక్ట‌ర్ స్కేల్‌పై 6.4 తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభ‌వించింది. ఇళ్లు, భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం అయ్యాయి. నేపాల్ భూకంపం ధాటికి ఢిల్లీలోనూ స్వ‌ల్పంగా భూమి కంపించింది. దాంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌తో రోడ్ల‌పైకి వ‌చ్చి చేరారు.