Narendra Modi: ఆ వెబ్ సిరీస్ చూసారా.. ఈ రీల్ చూసారా..?

Delhi: ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi) దిల్లీ మెట్రోలో ప్ర‌యాణించారు. దిల్లీ యూనివ‌ర్సిటీలో (du programme) జ‌ర‌గ‌బోయే శ‌తాబ్ది ఉత్స‌వాల్లో మోదీ పాల్గొన‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీ యూనివ‌ర్సిటీ యూత్‌తో క‌లిసి దిల్లీ మెట్రోలో ప్ర‌యాణించారు. అయితే మోదీ వారితో మాట్లాడిన అంశాలు వైర‌ల్ అవుతున్నాయి. ఆ వెబ్ సిరీస్ చూసారా.. ఈ రీల్స్ చూసారా అంటూ స్టూడెంట్స్ మోదీతో స‌ర‌దాగా చ‌ర్చించార‌ట‌. లోక్ క‌ళ్యాణ్ మార్గ్ నుంచి విశ్వ విద్యాల‌య మెట్రో స్టేష‌న్ వ‌ర‌కు మోదీ ప్ర‌యాణించారు. సైన్స్ టాపిక్స్ నుంచి మీమ్స్ వ‌ర‌కు వారి ఇలా చాలా విష‌యాల‌ను వారు చ‌ర్చించుకుంటున్నారు అని మోదీ తెలిపారు.