Nara Lokesh: రాజ‌మండ్రి జైల్లో ఖైదీ మృతి.. లోకేష్ వైర‌ల్ ట్వీట్

దోమలతో కుట్టించి జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నారా లోకేష్ (nara lokesh) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయ‌నకు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు. ఇటీవల రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ బారిన పడి చనిపోయాడని త‌న తండ్రిని కూడా ఇలాగే చేయాలనేది సైకో కుట్ర అని ట్విటర్లో లోకేశ్ ఆరోపించారు.