Nara Lokesh: వ‌చ్చే వారం నుంచి యువ‌గ‌ళం పున‌ప్రారంభం

తండ్రి అరెస్ట్‌తో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు (yuvagalam padayatra) విరామం ఇచ్చిన నారా లోకేష్ (nara lokesh) వ‌చ్చే వారం నుంచి తిరిగి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో TDP ముఖ్య నేత‌ల‌తో లోకేష్ ఢిల్లీ నుంచి టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. జ‌గ‌న్ అవినీతి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల గురించి ఈసారి ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌కు తెలిసేలా పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు