Nara Lokesh: ఈసారి రాయలసీమలో…!

Nara Lokesh: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడం, పార్టీ కేడర్ ను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఈసారి రాయలసీమలో చేపట్టనున్నారు. ఈనెల 7వతేదీన (గురువారం) హిందూపురం నుంచి యువనేత నారా లోకేష్ మలి దఫా యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కేడ‌ర్‌కు యువనేత దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా మన TDP, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు.

తొలి విడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. టిడిపి-జనసేన కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు శంఖారావం సభలవద్దకు చేరుకొని సైకోపాలనలో తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు  7వ తేదీ ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే శంఖారావం సభల్లో యువనేత లోకేష్ పాల్గొంటారు. 8వ తేదీన ఉదయం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేష్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9వ తేదీన యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది. తిరిగి ఈనెల 10వ తేదీ నుంచి శంఖారావం యాత్ర యథావిధిగా కొనసాగనుంది. (Nara Lokesh)

ALSO READ: TDP జనసేన ప్ర‌క‌టించిన బీసీ డిక్ల‌రేష‌న్ అంశాలేంటి?

యువగళం స్పూర్తితోనే శంఖారావం

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విధ్వంసక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చి ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. 226 రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కి.మీ.లు సాగిన పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు నేరుగా పాల్గొని తమ కష్టాలు చెప్పుకున్నారు. యువగళానికి ప్రజల నుంచి లభించిన అనూహ్య స్పందనను తట్టుకోలేక ఏ విధంగానైనా అడ్డుకోవాలనే దుర్భుద్ధితో జగన్ ప్రభుత్వం కుట్రపన్నింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో పెట్టడంతో యువగళానికి 79 రోజుల పాటు సుదీర్ఘ విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువగళాన్ని గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు బాబు సూపర్ – 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువనేత లోకేష్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో సూపర్ సక్సెస్ సాధించిన యువగళం స్పూర్తితోనే లోకేష్ శంఖారావాన్ని పూరించారు.