Nara Lokesh: ఓటమి భయంతోనే జగన్ బరితెగింపు చర్యలు!

Nara Lokesh: ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్ TDP నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పాడని అన్నారు.

మాజీమంత్రి నారాయణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని… మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని విమ‌ర్శించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నోటిఫికేషన్‌కు ముందే ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అరాచకపర్వానికి తెరలేపిన నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకులను పంపించాలని… అవసరమైతే కేంద్రబలగాలను రంగంలోకి దించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.