Nara Lokesh: సాక్షి జంపా? జీతాల్లేవా?

Nara Lokesh satire on sakshi media

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సాక్షి మీడియా జ‌ర్న‌లిస్ట్‌ల‌పై సెటైర్లు వేసారు. కియా మోట‌ర్స్ కంపెనీకి సంబంధించిన మ‌రో ప్రాజెక్ట్‌ ఏపీకి రావ‌డం ప‌ట్ల లోకేష్ హ‌ర్షం వ్య‌క్తం చేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు.

“” చంద్ర‌బాబు నాయుడు ఏ కంపెనీని తీసుకొచ్చినా అది త‌మ వ‌ల్లే అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు జ‌గ‌న్. గ‌తంలో కియా మోట‌ర్స్ కంపెనీని తెస్తే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాసిన లేఖ వ‌ల్లే అది సాధ్యం అయ్యింద‌ని అన్నారు. టీసీఎస్ వ‌స్తే తమ వల్లే అంటున్నారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు రాజ‌శేఖ‌ర్ ఆత్మ క‌నిపించి చెప్తోందేమో. నేను ఓపెన్‌గా అడుగుతున్నాను. మీరు ఏపీకి ఎన్ని కంపెనీలు తెచ్చారు? గ‌తంలే వైఎస్సార్ కాంగ్రెస్ త‌రిమేసిన కంపెల‌న్నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాబోతున్నాయి. మేం తీసుకొస్తాం. నేను రెడ్ బుక్ అన్నాన‌ని జ‌గ‌న్ గుడ్ బుక్ అంటున్నారు. దీనిని బ‌ట్టి చూస్తే న‌న్ను చూసి వారు స్ఫూర్తిపొందుతున్న‌ట్లున్నారు. మంచి విష‌య‌మే“” అని తెలిపారు.

ఆ త‌ర్వాత లోకేష్ జ‌ర్న‌లిస్ట్‌ల వైపు చూస్తూ.. సాక్షి ఎక్క‌డ‌? జంపా? జీతాలివ్వడం లేదా? టీవీ9 ఎక్క‌డా? ఎన్టీవీ ఎక్క‌డ‌? ఈ బ్లూ మీడియా ఎక్క‌డ‌.. ఏం ప్ర‌శ్న‌లు లేవా అని సెటైర్ వేయ‌డం వైర‌ల్‌గా మారింది.